జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్)లో అప్పుగా తీసుకోవడం వీలవుతుందా? పదవీ విరమణ, అత్యవసరాలకు సంబంధించి ఈ రెండింటిలో ఏది మెరుగైనది?
దీర్ఘకాలిక అవసరాల కంటే తక్షణ అవసరాలు, కోరికలు, కలల కోసం ఖర్చు పెట్టాలని చూడటం మానవ బలహీనత. పదవీ విరమణ చేశాక పింఛను అత్యవసరం. పింఛను కోసం మొదలు పెట్టిన దీర్ఘకాలిక పొదుపు, పెట్టుబడులను మధ్యలో తీసుకోకూడదనే లక్ష్యంతో ఎన్పీఎస్ టైర్ 1 ఖాతాలో మొత్తాన్ని మధ్యలో వెనక్కి తీసుకోకూడదనే నిబంధన విధించారు. ఇటీవల దీన్ని కొంత సడలించారు. పిల్లల చదువు, పెళ్లి, ఇంటి నిర్మాణం, గుండెపోటు, పక్షవాతం, ప్రమాదం వంటి ఆరోగ్య అవసరాలకు మన ఎన్పీఎస్ నిల్వలో 25శాతం వెనక్కి తీసుకోవచ్చు. ఎన్పీఎస్ ప్రారంభించిన మూడేళ్ల తర్వాత ఈ సదుపాయం లభిస్తుంది. పదవీ విరమణ చేసేలోగా మూడుసార్లు ఈ సదుపాయం వినియోగించుకోవచ్చు. పీపీఎఫ్లో వడ్డీ జనవరి నుంచి 7.6శాతం. ఎన్పీఎస్ టైర్-1 ఈక్విటీలో గత ఐదేళ్ల రాబడి 14శాతం వరకూ ఉంది.ఇందులో ప్రభుత్వ బాండ్ పథకంలో కూడా రాబడి 8.47% పైగానే ఉంది. సెక్షన్ 80సీ కింద రూ.1,50,000 పెట్టుబడి పెట్టి, అదనంగా మరో రూ.50వేల పెట్టుబడి వరకూ ఎన్పీఎస్లో మదుపు చేసి, ఆదాయపు పన్ను రాయితీ పొందవచ్చు. కాబట్టి, మీరు ఎన్పీఎస్ ఎంచుకోవచ్చు.
.jpeg)
0 Post a Comment:
Post a Comment